PPM: సీతానగరం మండలం రామవరం, రెడ్డివానివలస గ్రామాలలో మంగళవారం సంచార వైద్య సేవలను సీతానగరం పీహెచ్సీ సిబ్బంది నిర్వహించారు. సుమారు 68 మందికి షుగర్, బిపి, మోకాళ్ళనొప్పులు, జలుబు, దగ్గు మొదలగు వాటికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఆహార నియమావళి పట్ల అవగాహన కలిగి ఉండాలని ANM మౌనిక అన్నారు.