పార్వతీపురం పేరుతో ‘మన్యం జిల్లా యూనిట్’గా ఒక పార్లమెంట్ స్థానం ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి అన్న మీడియా కథనాల నేపథ్యంలో ఆయన స్పందించారు.