MHBD: మరిపెడ మున్సిపాలిటీలో 2026–27 సంవత్సరానికి గాను తైబజార్, పశువుల సంత అంగడీ వేలం ఈ నెల 19న నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ విజయానంద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ. 3 వేల చెల్లించి దరఖాస్తు ఫారం పొందాలని, రూ.3.50 లక్షల డిపాజిట్ నిర్ణయించినట్లు చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 18లోపు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.