NLG: నకిరేకల్ సమీపంలోని చందంపల్లి బస్ స్టేజీ వద్ద NH-65 హైవే రోడ్డు పక్కన ‘ఇంద్రాస్ ఫ్లాష్ బిగ్గెస్ట్’ పేరిట భారీ EV ఫాస్ట్ చార్జింగ్ కేంద్రానికి భూమిపూజ చేశారు. కేవలం రూ.16కే ఒక్క కిలోవాట్ చార్జింగ్ అందించి వాహనదారులపై ఆర్థిక భారం తగ్గించడమే తమ లక్ష్యమని నిర్వహకులు తెలిపారు. 1250 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ కేంద్రం ఒక్క నెలలో ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.