MDCL: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభానికి ప్రభుత్వం సిద్ధమైంది. మేడ్చల్ జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఎంపిక చేసి, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సమగ్ర విద్య అందించనున్నారు. విద్యార్థులకు స్కూల్ బస్సు సౌకర్యంతో పాటు పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.