సిద్దిపేట: హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో ముచ్చటిస్తూ, ప్రధాన రోడ్డు పనులు, నాళా పనులు పరిశీలించారు. అనంతరం పట్టణ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.