NGKL: కాంగ్రెస్ నుంచి మాదిగలకు రాజ్యసభ స్థానం కేటాయించాలని సోమవారం ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్లోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మూడు లోక్సభ స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని కోరారు.