MDCL: అల్వాల్ సర్కిల్లోని కొత్తబస్తీలో మురుగు కాలువలు తరచుగా బ్లాక్ అవుతూ, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే సమస్యలపై బుధవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులతో కలిసి పర్యటించారు. మురుగు లైన్ తరచుగా మూసుకుపోతున్నందున కొత్త లైన్ వేయడానికి అంచనా (ఎస్టిమేట్) సిద్ధం చేసి ప్రాధాన్యతతో ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.