MNCL: పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఉపాధ్యక్షులు రఘునాథ్ వెల్లడించారు. లక్షెట్టిపేట పట్టణంలో వివిధ మండలాల బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఇస్తున్న శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయడం లేదన్నారు. బీజేపీ నాయకులు ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.