MHBD: ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలతో రైతులు తీవ్రంగా భయాందోళన చెందిన ఘటన కొత్తగూడ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గోపాలపురం రహదారి వెంబడి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పును వదిలారు. రహదారితో పాటు పరిసర ప్రాంతంలో తీవ్రంగా మంటలు వ్యాపించాయి. సమీపంలోని మొక్కజొన్న పంటల వైపు వెళ్లడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు.