జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు టీచర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో కొండాపురం ZPHSలో మండల స్థాయి తెలుగు ప్రతిభా పోటీలు నిర్వహించారు. దస్తూరి పోటీల్లో అనూష శ్రీ, సంగీత ప్రతిభ కనబరిచారు. పద్య పఠనంలో నందిని, పవిత్ర మెప్పించారు. తెలుగు ప్రతిభా పరీక్షలో రాఘవేంద్ర ప్రథమ స్థానం సాధించారు. విజేతలను నిర్వాహకులు అభినందించారు.