KMM: గుండెపోటుతో మరణించిన వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి.. మాజీ ఎమ్మెల్యే చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. మదన్ లాల్ హఠాన్మరణం బాధాకరమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.