JN: పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నేటి నుంచి ఈనెల 22వ తేదీ వరకు మూసి వేయనున్నట్లు యార్డు ఛైర్మన్ శివరాజ్ యాదవ్ తెలిపారు. ఉగాది, రంజాన్, వారంతపు సెలవుల కారణంగా నాలుగు రోజులపాటు మార్కెట్ బంద్ కానున్నట్లు ఆయన వెల్లడించారు. మళ్లీ ఈనెల 23వ తేదీన మార్కెట్ పున: ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.