WGL: నర్సంపేట మినీ స్టేడియంలో వాకర్స్ ఇంటర్నేషనల్ 303,అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది నూతన శ్రీ పరాభవ నామ సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వం వహించారు. ఉగాది కొత్త ఆశలు, లక్ష్యాలకు నాంది పలికే పండుగ అని ఆయన పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.