MDK: చిలిపిచేడు మండలం అజ్జమరి గ్రామంలో డ్వాక్రా గ్రూపులకు చెందిన శ్రీనిధి రుణాల మొండి బకాయిల వసూళ్లను బుధవారం అధికారులు ప్రారంభించారు. ఏపీఎం గౌరీశంకర్, పురుషోత్తం, బ్యాంక్ మేనేజర్, సీసీలు, ఫీల్డ్ ఆఫీసర్లు గ్రామంలో మహిళలను కలిసి బకాయిలు చెల్లించాలని కోరారు. సమయానికి రుణాలు చెల్లించి గ్రూపుల బలోపేతానికి సహకరించాలని సూచించారు.