SRCL: మద్యం సేవించి వాహనాలు నడపరాదని వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోని మూలవాగు వంతెన వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుని జీవితాలు కోల్పోతున్నారని అన్నారు. పట్టణ సీఐ వీరప్రసాద్, జిల్లా ట్రాఫిక్ సీఐ సురేష్ పాల్గొన్నారు.