SRD: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు 14-15 ఏళ్ల బాలికలందరికీ తప్పనిసరిగా హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మిషన్ మోడ్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల హెల్త్ ప్రొఫైల్, డిజిటల్ హెల్త్ కార్డుల పురోగతిని సమీక్షించారు.