MLG: గోవిందరావుపేట మండలం రంగాపూర్ గ్రామానికి జెజ్జరి రామక్క ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి చిత్రపటం వద్ద నివాళి అర్పించి, వారికి రూ. 3000 ఆర్థికసహాయం అందజేశారు. అలాగే మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.