SRCL: గంభీరావుపేట మండల కేంద్రంలో వీవో (VO) భవన నిర్మాణానికి సర్పంచ్ మల్లుగారి పద్మ సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాలు దోహదపడతాయని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు భాగ్య పాల్గొన్నారు.