SRCL: పాక్షిక చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3వ తేదీన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలతో పాటు అన్ని అనుబంధ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున ప్రాతఃకాల పూజలు ముగిసిన వెంటనే ద్వారబంధనం చేయనున్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులను అనుమతిస్తారు.