NRPT: రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మన వారసత్వపు పండుగగా నిలుస్తుందని, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు జాతిని సజీవంగా ఉంచుతాయన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధి వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని పేర్కొన్నారు.