SRD: గుమ్మడిదల మండలం బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘట్టం ఎల్లయ్య కళాకారుల బృందం యక్షగానం ప్రదర్శించారు. మయసభ నాటకంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.