MDK: జాతీయ ఆహార భద్రత మిషన్- మొక్కజొన్న పథకంలో రాయితీపై మండలంలోని రైతులకు బయో సీడ్ 9544 హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ అధికారి యు.వసంతరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో పత్తి సాగు చేసిన కొంతమంది రైతులు పత్తి పంట అనంతరం మొక్కజొన్న పంటను విత్తనున్నట్లు తెలిపారు.