NLG: హోళీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ వేడుక సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందించాలని కోరారు. పర్యావరణానికి హాని కలిగించని ప్రకృతి సిద్ధమైన రంగులతో సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.