MHBD: నెల్లికుదురు మండలంలోని నైనాల గ్రామంలో చట్ట సాయిలుతో పాటు ఆయన మనవడు యాకయ్యపై ఇంటి స్థలం గొడవలో అదే గ్రామానికి చెందిన ఎండీ, పాలుద్దీన్, ఇమామ్, అన్వర్లు కర్రతో దాడికి పాల్పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు బాధితుల ఇంటి వద్దనే కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.