BDK: బూర్గంపాడు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం ఎస్సై నాగబిక్షం, తహసీల్దార్ ముజాహిద్ కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలోని వసతుల గురించి అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని వారిని కోరారు.