NLG: ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొని ఉత్సాహంగా పరుగులో పాల్గొన్నారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.