NLG: చిట్యాల పట్టణంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు జరిగిన పదవ తరగతి తెలుగు పరీక్షకు 415 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 417 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా.. ఒకరు గైర్హాజరుకాగా, మరొకరికి తెలుగు పరీక్ష నుంచి మినహాయింపు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు వెల్లడించారు.