SRPT: కోదాడ పట్టణం 28వ వార్డులో మంగళవారం “మన వార్డు – మన శుభ్రత” కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ తోట జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీనన్న మిత్రమండలి సభ్యులు కలిసి వార్డులోని మురుగు కాల్వలను శుభ్రం చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వారు వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.