NLG: రంజాన్ పండగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు అందజేసేందుకు ప్రభుత్వం కానుకలు సిద్ధం చేసింది. పండుగ సమీపిస్తుండటంతో రంజాన్ తోఫా ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చేరవేసింది. దీంతో భాగంగా ఉమ్మడి జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి తోఫా అందించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో 9,750 కుటుంబాలను అధికారులు గుర్తించారు.