ఆసిఫాబాద్ జిల్లాకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను గడువులోగా సాధించాలని కలెక్టర్ కే. హరిత బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్లో జరిగిన 2025 – 26 మూడో త్రైమాసిక సమీక్షలో ఆమె మాట్లాడారు. రూ. 3,023 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ. 1,581 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. PM ముద్ర యోజన, PM విశ్వకర్మ తదితర పథకాల లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.