MDK: రామాయంపేట మున్సిపాలిటీలో అనూహ్య రాజకీయ మార్పు చోటుచేసుకుంది. 2వ వార్డు కౌన్సిలర్ కొక్కు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో, మున్సిపల్ ఛైర్పర్సన్, పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.