KMM: ఏదులాపురం మున్సిపాలిటీలోని వెంకటగిరిలో శ్రీ గోవింద మాంబ సమేత జగద్గురు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శిఖర కలశ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ళ, భక్తులు పాల్గొన్నారు.