NLG: నార్కట్పల్లి మండలం గోపలాయిపల్లి శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి 7గంటలకు స్వామి వారి రధోత్సవం నిర్వహించనున్నట్లు దేవాలయ వ్యవస్థాపక ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.