RR: చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవుని ఎర్రవల్లి 3వ వార్డులో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని కౌన్సిలర్ మీనాక్షి సత్యనారాయణ నిలబెట్టుకున్నారు. శుక్రవారం పాత బోరుకు మరమ్మతులు చేయించి నీటిని ప్రారంభించారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందిస్తూ పరిష్కరించే కౌన్సిలర్పై వార్డు ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.