KMM: కామేపల్లి మండల పరిధిలోని పంచాయతీ వార్డు మెంబర్లకు ఈరోజు నుంచి ఈనెల 28 వరకు శిక్షణ తరగతులను కామేపల్లి రైతు వేదికలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.రవీందర్, ఎంపీవో వీవీఎస్ శాస్త్రి తెలిపారు. 12 పంచాయతీలకు సంబంధించిన 114 మంది వార్డు మెంబర్లుకు తొలి విడతలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వార్డు మెంబర్లు సకాలంలో శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.