NRML: ముధోల్ మండలం తరోడా గ్రామ పల్లె దవాఖానలో వైద్య సేవలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని AIPSU నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆశా వర్కర్లే నిర్వహణ కొనసాగుతోందన్నారు. చిన్న సమస్యలకే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే వైద్యుడిని నియమించి నిత్య సేవలు అందించాలని, లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.