HNK: ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ పుట్టా రేణుక కుమారస్వామి అన్నారు. నారాయణగిరి గ్రామంలో రూ. 25 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఇవాళ సర్పంచ్ శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.