వరంగల్ జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 288 పాఠశాలల నుంచి 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ఇందులో 4,932 మంది బాలురు, 4,560 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల కోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.