SRD: పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి నుంచి శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.