BDK: ఇల్లందు పురపాలక ఛైర్ పర్సన్ శ్రీమతి దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముందుగా మంత్రికి పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి దిశగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటున్న ధైర్యమైన నిర్ణయాలు ప్రజలలో నూతన నమ్మకాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు.