సూర్యాపేట: మోతే మండల కేంద్రంలో పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. లబ్ధిదారులు ఇంకా నిర్మాణాలు చేపట్టని ఖాళీ ప్లాట్లను ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ ఆక్రమణలను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.