MDK: నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై నీలం మధు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీలు మారుతూ నీలం మధు బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎంపీకి మద్దతు ప్రకటించారు.