BDK: శ్రీరామ నవమి సందర్భంగా జరిగే కళ్యాణ తలంబ్రాల కోసం భక్తులు రూ.4 లక్షల విరాళాన్ని అందించారు. హైదరాబాద్ వాస్తవ్యులు ముప్పాల భవాని ప్రసాద్, యుగంధర్ రూ.4 లక్షలను విరాళంగా భద్రాచలం దేవస్థాన ప్రాంగణంలో అందజేశారు. ఈ విరాళాన్ని భక్తిశ్రద్ధలతో భద్రాచలం దేవస్థానం ఈవో దామోదర్కి అందజేశారు. అనంతరం రామయ్యను దర్శించుకున్నారు.