GDWL: రాజోలిలోని ఆర్డీటీ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దస్తగిరి శుక్రవారం పరిశీలించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తే బిల్లులు అంతే త్వరగా వస్తాయని, పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.