KMR: కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శనివారం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఇరు పార్టీల నాయకులు సంయమనం పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.