VKB: కొండగల్ మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం తరఫున ఇబ్రహీం మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ‘సర్వమత సారం ఒక్కటే, మనుషులంతా సోదర భావంతో ఉండాలి’ అని ఛైర్మెన్ పేర్కొన్నారు. తహశీల్దార్ రాంబాబు, TPCC సభ్యుడు MD. యూసుఫ్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.