MNCL: బీసీలపై దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. గురువారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు బీసీలపై దాడులు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. వెంటనే బీసీల రక్షణ, భద్రతకు బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.