KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి పాలేరు సరిహద్దుల్లో కొందరు అక్రమార్కులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీల సాయంతో పైనంపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఇసుకను తరలిస్తున్నారని శనివారం స్థానికులు తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.