SRCL: రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని చెప్పారు.